ఘనంగా వి. ప్రతాప్ రెడ్డి వర్ధంతి

Published: Wednesday May 05, 2021

జిన్నారం/ ఐడిఏ బొల్లారం. మే 4, ప్రజాపాలన ప్రతినిధి : బొల్లారం గ్రామ మాజీ సర్పంచ్ మరియు జిన్నారం మాజీ మండల పరిషత్ అధ్యక్షులు స్వర్గీయ వి.ప్రతాప్ రెడ్డిగారి 19వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతాప్ రెడ్డి కుటుంబం సభ్యులు వేర్వేరు గా  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో మాజి జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి, చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి, ఆయన కుమారుడు 13 వ వార్డు కౌన్సిలర్ వి. వేణు పాల్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత చంద్రారెడ్డి, కౌన్సిలర్లు వారాల గోపాలమ్మ, చంద్రయ్య, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, చక్రపాణి, దిగంబర్, శ్రీను, ఆటో యూనియన్ ‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.