ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Published: Tuesday February 09, 2021

వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూసి పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా బద్దం యాదిరెడ్డి,మంగ నర్సింహ అను వ్యక్తులు తమ ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆదివారం రాతి స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు