*ఈషా హాస్పిటల్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి*

Published: Monday May 16, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 15 ప్రజా పాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈషా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని  ఐసీయూ స్కానర్స్  ఇతర వైద్య పరికరాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ సంపత్ గౌడ్, డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శర్మ, హాస్పటల్ సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు.