కేంద్రాలను సందర్శించిన వ్యవసాయ అధికారులు
Published: Saturday December 03, 2022
తల్లాడ, డిసెంబర్ 2 (ప్రజా పాలన న్యూస్):
మండల పరిధిలోని తల్లాడ, పినపాక, అన్నారుగూడెం, బిల్లుపాడు, మల్లారం, నూతనకల్, మిట్టపల్లి కుర్నవల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ద్వారా పిఎం కిసాన్ ఈకే వైసీ నమోదు కేంద్రాలను సత్తుపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు యు. నరసింహారావు, మండల వ్యవసాయ అధికారి ఎండీ తాజుద్దీన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం చేయించుకొని రైతు సోదరులందరూ వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేవైసీ నమోదు కేంద్రాలలో లేదా దగ్గరలోని మీసేవ, పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించి ఈ కేవైసీ చేయించుకోవాలి తెలిపారు.
Share this on your social network: