శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల వేతనాలు చెల్లించాలి. . కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ .

Published: Wednesday February 15, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: 
 
శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులకు నాలుగు నెలల వేతనాలు మూడు సంవత్సరాల బోనసులు వెంటనే చెల్లించాలని కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాదులోని శాలివాన పవర్ ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ మల్కా కొమురయ్య ఇల్లు ముట్టడి చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు   ప్రతినెల వేతనాలు చెల్లించి, కంపెనీలో కార్మికుల బయోమెట్రిక్ విధానాన్ని కొనసాగించాలని, మరో పది సంవత్సరాలపాటు ప్రభుత్వంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పి పి ఏ చేసుకుని పవర్ ప్లాంట్  విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే విధంగా కృషిచేసి  కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో  రాజు యాదవ్ బి ఎం ఎస్ జిల్లా కార్యదర్శి, మల్లేష్ బి ఎం ఎస్,ఎడ్ల శ్రీనివాస్ పి ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, ఎన్ సత్యనారాయణ ఎస్ ఆనందరావు కె శ్రీనివాస్, కె సుధీర్, ఎస్ తిరుపతి కే బుచ్చయ్య, డి మల్లయ్య ఆర్ తిరుపతి ఏ శ్రీనివాస్ పి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.