కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

Published: Wednesday June 23, 2021

బెల్లంపల్లి, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను బెల్లంపల్లిలో నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సోమగూడెం లో నిరాహార దీక్ష చేపట్టినారు. మాజీ జెడ్పిటిసి కారుకూరి రాంచందర్ నాయకులకు పూలమాలలు వేసి దీక్షలో కూర్చుండ పెట్టినారు. ఈ సందర్భంగా కారుకూరి రాంచందర్ మాట్లాడుతూ బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు మంచిర్యాల జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం ఎంపీటీసీ చుంచు మల్లమ్మ, పిఎసిఎస్ చైర్మన్ చింతం స్వామి, పాత బెల్లంపల్లి సర్పంచ్ పెట్టం రాయలింగు, నాయకులు ముత్తే భూమయ్య, గోమాస భీమయ్య, చుంచు లింగయ్య, దుడం మహేశ్, స్వామి, ప్రవీణ్, సాగర్, రాకేష్, సారయ్య, వెస్లీ, క్రిష్ణ, రక్షన్, సంతోష్, రాజలింగు, కుమార్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.