ముమ్మరంగా టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం

Published: Saturday September 17, 2022
బోనకల్, సెప్టెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ , టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామనాథం మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వం నమోదు చేసుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని, 2024 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం కీలకంగా మారిపోతుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీలో నాయకులు పార్టీని వదిలి వెళ్లిన కార్యకర్తల స్థిరంగా ఉన్నారని, అతి త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కార్యకర్తలు అందరికీ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. గోవిందపురం మాజీ సర్పంచ్ కళ్యాణపు వెంకటేశ్వరరావుకు పార్టీ సభ్యతన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ,మండల కార్యదర్శి మరీదు బరకయ్య, రాష్ట్ర గిరిజన సంఘం కార్యదర్శి బానోతు శీవల నాయక్, టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు బంధం అనిల్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు మామిళ్ల నరసింహారావు, మండల నాయకులు బండి శ్రీనివాసరావు, యూత్ నాయకులు జట్టేమ్ కిరణ్ ,వార్డ్ మెంబెర్ ఏసుపోగు బాలక్రిష్ణ, మామిళ్ల వెంకటనారాయన ,చితిరల వెంకటేశ్వర్లు, తాళ్లూరి సత్యం,తదితరులు పాల్గొన్నారు.