సునీతకు నివాళులర్పించిన మాజీ ఎంపీ పొంగులేటి..

Published: Saturday November 26, 2022

 తల్లాడ, నవంబర్ 25( ప్రజాపాలన న్యూస్) :- మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన 9వ వార్డు మెంబర్ మేడి సునీత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి సునీతకు నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని వారి కుమారులు నరేష్, నాగేశ్వరరావు, రాంబాబులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట టిఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టా దయానంద్ ,డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, ఎర్రి నరసింహారావు ,గణేశుల రవి ,లక్ష్మీనారాయణ, పోట్రు శ్రీను, సర్పంచ్ మాగంటి కృష్ణయ్య, ఉప సర్పంచ్ గుత్తికొండ అన్నమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాగంటి వెంకటేశ్వర్లు, మాగంటి శ్రీను, బానోతు నరసింహారావు, మీర్జా మహబూబ్  ఉన్నారు.