రాజ్యసభ సభ్యులకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు..
Published: Saturday November 19, 2022
తల్లాడ, నవంబర్ 18 (ప్రజాపాలన న్యూస్): తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం హాజరయ్యారు. తొలుత తల్లాడలో భారీ స్వాగత ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు మహిళలు భారీగా తరలివచ్చారు. దీంతో తల్లాడ పట్టణం గులాబీమయం అయింది. అదేవిధంగా కళాకారులు వివిధ రకాల నృత్యాలు చేయటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. టిఆర్ఎస్ మండల పార్టీ పూర్తి సహకారం అందించి సభను విజయవంతం చేశారు.
Share this on your social network: