జర్నలిస్ట్ కు ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ.
Published: Friday April 23, 2021
మంచిర్యల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 22, ప్రజాపాలన : కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండ్ర శ్రీనివాస్ కు అమెరికాలో నివాసం ఉంటున్న తాళ్లపల్లి కిషన్ రావు చేయూత అందించారు. శ్రీనివాస్ కు చికిత్స అందించేందుకు కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. ఆయన కు మెరుగైన వైద్యం కోసం రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. కరోనా నుంచి కొలుకునేందుకు అవసరమైతే మరింత సహాయం అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్ఆర్ఐ స్పందించిన తీరుపై పలువురు స్థానికులు ప్రశంసించారు
Share this on your social network: