వడ్లు కొనాలని రైతులు ధర్నా

Published: Wednesday November 24, 2021

రాయికల్ నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం లోని మైతాపూర్ రైతుఐక్య వేదిక ఆద్వర్యంలో రైతులు రోడ్ పై బైఠాయించి ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కొనాలని, ఎ గ్రేడ్, బి గ్రేడ్ చూడకుండా అకాలవర్షం పడి ధాన్యం తడిసి ముద్ద అవుతుందని, వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాయికల్ తహశీల్దార్ మహేశ్వర్, ఎస్.ఐ కిరణ్ కుమార్ గౌడ్ ధర్నా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.