వాసవీక్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

Published: Tuesday January 18, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 17, ప్రజాపాలన : వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా అన్నదానం ను దాత కొంకుముట్టి లావణ్య వెంకటేశ్ దంపతుల సహకారంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటుకం హరీష్, ముక్తా శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవీక్లబ్ అనేక సేవా కార్యక్రమాలలో ముందుగా నిలుస్తుందని ఇందులో భాగంగానే ప్రతీ నెల రైల్వే స్టేషన్ ముందు దాతల సహకారంతో అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిరుపేదలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ క్యాబినెట్ ట్రెజరర్ పుల్లూరి బాలమోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల ముఖేష్, వాసవీ క్లబ్ రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ ఛైర్మన్లు కాచం సతీష్, కొంకుముట్టి వెంకటేశ్, వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, జిల్లా వికెఎస్పి ఇంచార్జి అప్పాల శ్రీధర్, వాసవీక్లబ్ సభ్యులు గౌరిశెట్టి ధనలక్ష్మి, మల్యాల యోగేశ్వర్, గడ్డం రమాదేవి రమేష్, ఎర్రం వెంకటేష్, ముక్తా వేణు, గంప నాగేందర్, కొలిపాక విఘ్నేష్, ముస్త్యాల శ్రీనివాస్, పడకంటి శ్రీనివాస్, తనుకు శ్రీనివాస్, పడకంటి ప్రవీణ్, ముక్తా శ్రీనివాస్, కొత్త కృష్ణ, చందూరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.