*గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

Published: Thursday September 08, 2022

మధిర సెప్టెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి గర్భిణీ బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం తోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మధిర ఐసిడిఎస్ సిడిపిఓ శారద శాంతి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని దెందుకూరు నాలుగు మరియు ఐదు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి అంగన్వాడీ కేంద్రాలలో బరువు, ఎత్తు, పోషక స్థాయిలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా తల్లులకు తక్కువ ఖర్చుతో పిల్లలకు అందించే పోషకాహార పదార్థాల గురించి అవగాహన కల్పించారు. లోప పోషణ ఉన్నటువంటి పిల్లలకు ఆకలి పరీక్షలను నిర్వహించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. పోషణ మాసం సందర్భంగా ఈనెల1వ తేదీ నుండి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత ఐకెపి సిసి రమాదేవి హెచ్ఎం వినోద్ అంగన్వాడీ టీచర్లు పగిడిపల్లి సావిత్రి, గుర్రం అరుణ, పగిడిపల్లి కృపమ్మ, స్వరాజ్యలక్ష్మి, లక్ష్మి మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.