పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలి

Published: Tuesday March 23, 2021
బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్.
 
అమీర్పేట (ప్రజాపాలన ప్రతినిధి) : బహుజనుల ఆరాధ్యదైవం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్.స్థానిక బాపునగర్ బస్తీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లపై సవతి ప్రేమ ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఎస్సీ లకు ఇంతవరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. ఆసరా పింఛన్లు అధికార పార్టీ కి చెందిన వారికే దక్కుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇకనైనా బహుజనుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు, త్వరలో పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయాలని బీజేపీ ఎస్టీ మోర్చా డిమాండ్ చేస్తుందని తెలిపారు.