సాయంత్రం 4 గంటల వరకే ఆర్టీసీ బస్సులు

Published: Friday June 11, 2021
వికారాబాద్, జూన్ 10, ప్రజాపాలన బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇచ్చిందని వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ దైవాదీనం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ డిపో నుండి ఆర్టీసీ బస్సులను ఉదయం 6:00 గంటలకు బస్సులు బయలుదేరి సాయంత్రం 4:00 గంటల వరకు నడుస్తాయని అన్నారు. తిరిగి సాయంత్రం 6:00 గంటలకు డిపోకి చేరుకుంటాయని డిపో మేనేజర్ పేర్కొన్నారు. బస్ పాసులు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు బస్ పాస్ కౌంటర్ తెరిచి ఉంటుందని వివరించారు. ఈ సదుపాయాన్ని వికారాబాద్ పట్టణ ప్రజలు అందరూ వినియోగించుకోగలరని కోరారు.