మోడల్ స్కూల్ విద్యార్థికి జాతీయస్థాయి కాంస్య పతకం **

Published: Friday December 16, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 15 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
 
జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎం.వంశీవర్ధన్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలలో కాంస్య పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ గురువారం తెలిపారు. ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు కర్ణాటక లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం (చిక్కరంగుల) లో జరిగిన జాతీయ స్థాయి నెట్ బాల్ చాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జుట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ వర్ధన్ ను ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు బి.తిరుపతి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ప్రేమ్ కుమార్, పాఠశాల సిబ్బంది అభినందించారు.