పోల్కంపల్లి జడ్.పి.హెచ్.ఎస్ లో మాక్ పోలింగ్

Published: Thursday November 25, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : బుధవారం ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పోలింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలపై అవగాహన పెంచుకోవాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని విషయాలపై మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పాండురంగం, గ్రామ ఉపసర్పంచ్ కొమ్మిడి జంగా రెడ్డి, ఎంపీటీసీ చెరుకూరి మంగా రవీందర్, వార్డ్ మెంబర్స్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ నాయుడు, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.