బంటువారం జిల్లా పరిషత్ పాఠశాలకు ఆర్థిక సహకారం

Published: Friday January 27, 2023
* వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ నందు
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాల కు కలరింగ్ , మౌలిక సదుపాయాల కల్పన కోసం వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ నందు గురువారం 50వేల రూపాయల నగదును అందజేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలకు విచ్చేసిన ఆయన పాఠశాల పరిస్థితిని గమనించి అప్పటికప్పుడు 50000 నగదు అందజేశారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో  జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు గ్రామ సర్పంచ్ ఆలంపల్లి లావణ్య శ్రీనివాస్  ఆహ్వానించగా ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వడ్ల నందు తన  ఫౌండేషన్ తరపున  పాఠశాలకు పెయింట్ వేయడం కోసం 50 వేల రూపాయలను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు బోధించుటకు బోర్డ్స్ లేవు అని చెప్పగా వాటిని కూడా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్న  తన దృష్టికి తీసుకురావాలని తాను వాటిని నెరవేరుస్తానని అన్నారు. దానితో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ వడ్డనందుకు  కృతజ్ఞతలు తెలిపరు. ఈ కార్యక్రమంలో బంట్వా రం జడ్పిటిసి సంతోష ,బంటారం పిఎస్సి వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, మాల సోమరం సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ పిఎస్ చైర్మన్ బస్సు రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ మహేందర్, ఎంపీటీసీ పద్మ, ఎల్లయ్య, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.