మొదటి ప్రాధాన్యత ఓటు తో రాములు నాయకులు గెలిపించండి

Published: Friday March 05, 2021
పాలేరు, మార్చి 4, (ప్రజాపాలన ప్రతినిధి)ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  శ్రీ సభావత్ రాములు నాయక్  గారి గెలుపు కోసం మండల కాంగ్రెస్ నాయకులు నేలకొండపల్లి పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ  ఎండిఓ ఆఫీస్, ఎమ్మార్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ హై స్కూల్స్, ఆంధ్ర బ్యాంకు, ఎస్బిఐ బ్యాంకు, ఏపీజీవీబీ బ్యాంక్, ఎస్ టి ఓ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, ఏపీఎం ఆఫీస్ ఉపాధిహామీ ఆఫీస్ గవర్నమెంట్ హాస్పిటల్ తదితర ఆఫీసలలో ఉన్న పట్టభద్రుల ఓట్లను రాములు నాయక్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో  నేలకొండపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుక్కల ఆదం,పాలేరు నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు బచ్చల కూరి నాగరాజు, నేలకొండపల్లి మండలం బీసీ సెల్ అధ్యక్షుడు గుడిబోయిన వెంకటేశ్వర్లు, నేలకొండపల్లి మండలం కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య చిన్న నాయక్, నేలకొండపల్లి మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా, ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఖమ్మం పల్లెబోయిన లక్ష్మీనారాయణ, సోడిపొంగు వెంకన్న, కుమ్మరికుంట్ల పుల్లయ్య, జిల్లాపెళ్లి నాగేశ్వరావు, చిట్యాల రమేష్, సూర్యపెళ్లి రవి, షేక్ మదర్ సాహెబ్, నేలకొండపల్లి మండలం యువజన కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి నాగరాజు, అనంత నాగేంద్రబాబు, రెడ్డిబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు