ఎంపి బండి సంజయ్ ని విడుదల చేయాలి : 317 జివోను సవరించాలి

Published: Friday January 07, 2022

సారంగాపూర్, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన జి.ఓ నంబర్ 317 ను వెంటనే సవరించాలని మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ కు తరలించడం తెరాస ప్రభుత్వ పిరికిపందా చర్య అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పెంబట్ల గ్రామం హైస్కూల్ ఆవరణలో (స్వచ్ఛ భారత్) నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా అధ్యక్షుడు దీటి వెంకటేష్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సంతోష్ బాధినేని శేఖర్ వంగపెళ్లి పవన్ బొడ్డుపెళ్లి శేఖర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.