పోటు కృష్ణారావుకు ఘన నివాళులు అర్పించిన టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు

Published: Tuesday March 15, 2022
బోనకల్, మార్చి 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం(ఏ) గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు పర్యటించి ఇటీవలే మరణించిన పోటు కృష్ణారావు దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో టీఆరెఎస్ నాయకులు యన్నం కోటేశ్వరరావు, యర్రగుంట రమేష్, ఉమ్మిమెని కృష్ణ, బాగం నాగేశ్వరరావు, తోటకూర వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.