పల్లె ప్రగతిని విజయవంతం చేయండి. సర్పంచ్ పుల్లమ్మ..
Published: Thursday July 01, 2021
పాలేరు, జూన్ 30, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొనయి గూడెం గ్రామంలో ఈ రోజు నిర్వహించిన గ్రామ సభలో సర్పంచ్ పెంటమల్ల పుల్లమ్మ, మాట్లాడుతూ జూలై 1 నుంచి 10 వరకు చేపట్టనున్న పల్లె ప్రగతి కార్యక్రమంను విజయవంతం చేయాలని కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ. సూచించారు. బుధవారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యచరణ గ్రామ సభలో ఆమె . తెలంగాణ ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య, కార్యదర్శి బోళ్ల వీరబాబు, అంగన్వాడీ టీచర్ వడ్లమూడి నాగమణి, ఆశా కార్యకర్త చెరుకుపల్లి బేబి, సిబ్బంది బొడ్డు ఆంజనేయులు, కాస్తల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలో వివిధ గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో సర్పంచ్లు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. ఆయా గ్రామ సభలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపీటీసీ లు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్లు. వార్డు సభ్యులు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: