పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

Published: Monday February 13, 2023

జన్నారం, ఫిబ్రవరి 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని 1992-93 సంవత్సరానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న, 30 సంవత్సరాల తర్వాత  పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఒకరినొకరు చూసుకొని వారి యోగక్షమాల గురించి తెలుసుకున్నారు. ఆదివారం మండల కేంద్రంలోని 30 సంవత్సరాల క్రితం విద్యార్థులకు బోధించిన ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను సగరుకంగా ఆహ్వానించి వారి పాదాలకు కడిగి పుణ్యం చేసుకున్నమని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు చదువు నేర్పిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు శాలువా కప్పి సన్మానించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జక్కు భూమేష్, చెక్కల శశిధర్, గోపాలకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, దేవన్న, సుభాష్ గౌడ్, నహిర అలీ, శ్రీను, పూర్వ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.