అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఎస్సై సురేష్

Published: Thursday January 12, 2023
తల్లాడ, జనవరి 11 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడలోని శ్రీ వెంకట పద్మావతి రైస్ మిల్ ఎదురుగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 18 కేజీల గంజాయిని బుధవారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు.  తల్లాడలో ఎస్సై సురేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఏన్కూర్ నుండి తల్లాడకు వెళుతున్న ఆటోలో 18 కేజీల గంజాయి పట్టుబడింది. ఆటోలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని విచారించగా మాది చింతూరు అని,  ఈ గంజాయిని ఒరిస్సా సరిహద్దు నుండి తీసుకొని వస్తున్నామని తెలిపారు. తాసిల్దార్ శ్రీలత సమక్షంలో పంచనామా నిర్వహించారు. దీంతో  వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.