కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి నిరసనగా రేపు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని జ

Published: Friday December 23, 2022
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా రేపు శుక్రవారం అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు..
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో... రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆధ్వర్యంలో మహాధర్నా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీశ్రేణులు హాజరై ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు..
 కావున ఈ కార్యక్రమానికి మొరంపల్లి బంజర్ బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరు కాగలరని కోరిన బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామ అధ్యక్షుడు కైపు కగేందర్ రెడ్డి.