అంతర్జాతీయ వెజిటెబుల్ ఆయిల్స్ సదస్సులో ఉత్తమ రైతు అవార్డ్ అందుకున్న జోగన్ పల్లి వాసి
Published: Thursday January 19, 2023
కోరుట్ల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామానికి చెందిన రైతు సామ నాగేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ప్రో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ వెజిటెబుల్ ఆయిల్స్-2023 సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. అందులో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామానికి చెందిన సామ నాగేశ్వర్ రెడ్డి పురస్కారాలు అందుకున్నారు.ఉత్తమ రైతు పురస్కారం రావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Share this on your social network: