*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*
Published: Wednesday December 14, 2022
మధిర రూరల్ డిసెంబర్ 13 (ప్రజా పాలన ప్రతినిధి) మండలంలోని పలువురికి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను మంగళవారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర మండల పరిధిలోని ఇల్లూరు గ్రామానికి చెందిన పత్తే పరపు ప్రసన్న కి 27 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్ట కాలంలో భట్టి విక్రమార్క నిరంతరం అండగా ఉంటూ ఆపదలో ఉన్న అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. భట్టి విక్రమార్క నిరంతరం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా రని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు అద్దంకి రవికుమార్ మాజీ సర్పంచులు కర్నాటి రామారావు, షేక్ జహంగీర్ పత్తే పరపు సంగయ్య మదార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: