పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు

Published: Tuesday April 20, 2021
మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి 
మేడిపల్లి, ఏప్రిల్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : పారిశుద్ధ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని పరమేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం నాడు ఉప్పల్ కూరగాయల మార్కెట్లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, డీఈ చందనతో  కలిసి  మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి పర్యటించారు. మార్కెట్లో కుప్పులుగా పడి ఉన్న చెత్తను అప్పటికప్పుడే తొలగించేలా చర్యలు చేపట్టారు. మరోసారి మార్కెట్లో చెత్త లేకుండా చూడాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో బాకారం లక్ష్మణ్, పూజల హనుమాన్ దాస్, రాజేందర్ రెడ్డి, బోరంపేట్ జై కృష్ణ, ప్రశాంత్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, మురళీకృష్ణ రెడ్డి, ఆల్వల భాస్కర్, బోరంపేట్ రామ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, జనగాం రామకృష్ణ, ఎలుగుల అనీల్ కుమార్, గొరిగ జంగీర్, లక్ష్మణ్, జుత్తు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.