స.ప.స ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా గోళీ శ్రీనివాస్ నియామకం
Published: Monday September 19, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి:
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన న్యాయవాది గోలి శ్రీనివాసుని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఆదేశానుసారం రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ ఉత్తరయ్య ముదిరాజ్ ఆదివారం నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తూ, సమాచార చట్టం గురించి పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు, సహకరించిన రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ ఉత్తరయ్య ముదిరాజ్ రాజ్ కు, రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధి ఉష, సైదుల్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Share this on your social network: