హిమాంత్ బిశ్వాస్ శర్మ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి : నీలం పద్మ
Published: Tuesday February 15, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 14 ఫిబ్రవరి ప్రజాపాలన: ఆలేరు పోలీసు స్టేషన్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వాస్ శర్మ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసిన మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ నీలం పద్మ. యాదాద్రి జిల్లా ఆలేరు పోలీసు స్టేషన్ లో సోమవారం నాడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వాస్ శర్మ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆలేరు పోలీస్ స్టేషన్లో అధ్యక్షులు కార్యదర్శి నాయకుల ఆద్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సిసెల్ స్టేట్ కన్వీనర్ నీలం వెంకటస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: