రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పొరేషన్ అధ్యక్షుల రామిడి రామ్ రెడ్డి కి సన్మానం

Published: Wednesday October 27, 2021
బాలాపూర్, అక్టోబర్ 25, ప్రజాపాలన (ప్రతినిధి) : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రామిడి రామ్ రెడ్డి కి కళావతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులందరూ తన నివాసంలో కలిసి అధ్యక్షులను శాలువాతో సన్మానించారు. కార్పొరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.... కాలనిసభ్యులందరికీ ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు (సోషల్ మీడియా అధ్యక్షులు) రామిడి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు టి.సాయి కుమార్, ఎం మోహన్ రెడ్డి, సత్యనారాయణ, బాలాజీ, రామకృష్ణ, సుమన్, కాలనీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.