ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

Published: Friday July 16, 2021
- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
మెట్ పల్లి, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 16న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా కోరారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారన్నారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదన్నారు. ఈనెల 16న ఇందిరా పార్కు వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించే ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు తరి రాజారాం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కంబ నాగరాజు, నాయకులు మహ్మద్ ముఖీమ్, ఆడెపు రమణ తదితరులు పాల్గొన్నారు.