పేద మహిళా కుటింభీకులకు బియ్యం
Published: Monday May 09, 2022
మధిర 8 ప్రజాపాలనా ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుపంపిణి ట్టణంలో అజాద్ రోడ్డు నందు ప్రముఖ సామాజిక సేవకుడు మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య ఆధ్వర్యంలో దీర్ఘాకాలిక అనారోగ్యంతో బాధ పడుతున్న ఎర్రుపాలెం మండలం ఒక గ్రామ నివాసి కూటింభికులుకు మరియు మధిర మండలం ఒక గ్రామ నివాసి కూటింభీకులకు వీరి దయనీయ పరిస్థితి కొండయ్య వివరించగా మానవతా దృక్పధంతో స్పoదించిన మానవతావాది దయా హృదయులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ మక్కెన నాగేశ్వరావు గారు వారి తల్లి గారు ఐన లేటు మక్కెన కమలమ్మ పేరు మీదుగా అర క్వింటాలు బియ్యం దుస్తులు వితరణ చేయగా వాటిని లంకా కొండయ్య ఆదివారం సాయంత్రం తన గృహంలో పంపిణి చేసినారు. ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడుతూ మానవతా దృక్పధంతో ప్రతి ఒక్కరు పేదలను, ఆపదలో ఉన్న వారిని అదుకొనుటకు దయాహృదయలు ముందుకు రావాలని సూచించినారు. ఈ సహాయం అందించిన దాతకు కొండయ్య హృదయ పూర్వక అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు పండు, గోపి, శ్యామ్, కరుణ పాల్గొన్నారు
Share this on your social network: