ఉచిత వైద్య సేవలు అందించే విధంగా కామినేని హాస్పిటల్ వారి బృందం చాలా కృషి చేస్తుందని మునగనూరు
Published: Wednesday July 27, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి.
ఈ రోజు మునగనూరు వార్డ్ కార్యాలయంలో కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగనూర్ 15వ వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వేముల స్వాతి అమరేందర్ మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా కామినేని హాస్పిటల్ బృందం బిపి షుగర్ లాంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని కామినేని హాస్పిటల్ యజమాన్యాన్ని ఆమె కోరారు. అదే కాకుండా దాదాపుగా రెండు మూడు వందల మందికి పైగా సేవలందించి వారికి టాబ్లెట్స్ మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది బిల్ కలెక్టర్ అర్చన మరియు దోమలపలి శివకుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: