పునరావాస కేంద్రానికి జడ్పీటీసీ ప్రమీల శంకుస్థాపన

Published: Friday December 23, 2022
తల్లాడ, డిసెంబర్ 22 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామంలో గోవా కి చెందిన ఎన్.ఆర్. ఐ గ్రేగేరి డోమనిక్ ఫెర్నండ్స్ వారి కుటుంబ సభ్యులచే నిర్మిస్తున్న పునరావాస కేంద్రానికి తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల గురువారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ లో ఈ గ్రామంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పడు అనేకమంది బాధితులకు పునరావాసం కల్పించేందుకు వీలుగా ఈ కేంద్రం నిర్మాణం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలిండియా దేవుని సంఘ అధ్యక్షులు ఎల్డర్. టివి రావు  మంచి కార్యక్రమాన్ని ఈ గ్రామానికి తీసుకునిరావడానికి కారణమైన ఆదూరి ఆనందం, మణి, దాస్, రాజకుమార్ లకు పలువురు అభినందనలు తెలిపారు.
 
 నిర్వాహకులను సన్మానించిన జడ్పీటీసీ దంపతులు..
 
 
గత రెండు సంవత్సరాలుగా ఎంతో కస్టపడి, తను పుట్టి, పెరిగిన గ్రామంలో  సేవ చేయాలనే దృక్పధంతో, అనేకమంది నిరుపేద కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు కృషి చేసి, ఈ కేంద్రాన్ని నిర్మాణం చేయుటకు పూనుకొనిన ఆదూరి ఆనందం, మణి లను జెడ్ పి టి సి దిరిశాల ప్రమీల, దాసురావు లు శాలువాతో సత్కరించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ జిల్లా నాయకులు దిరిశాల దాసురావు, గ్రామ సర్పంచ్ ఆదూరి దాసురావు, కార్యదర్శి సురేష్,చింతానిప్పు భద్రయ్య, ఎస్ కే. హుస్సేన్, కొమ్మినేని వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఆదినారాయణ, వార్డ్ మెంబెర్ ఆదూరి రమేష్, గ్రామ యువత ఆదూరి కృష్ణ, కుటుంబరావు, బాలకృష్ణ,పాస్టర్ ఆదూరి సామెలు,పాస్టర్. ఆర్. కరుణాకర్ పాల్గొన్నారు.