ఉక్రెయిన్ దేశం పై రష్యా అధర్మ యుద్ధాన్ని ఆపాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా, ప్రజా సంఘాల ఆధ్వర్యం

Published: Thursday March 03, 2022
పాలేరు మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : ఉక్రైన్ పై రష్యా దురాక్రమణ యుద్ధాన్ని ఆపాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా, పి డి ఎస్ యు, పి వై ఎల్, ఐ ఎఫ్టీ యు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, అఖిలభారత రైతుకూలి సంఘం, మండలంకమిటీ ఆధ్వర్యంలో బుధవారం కూసుమంచి మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ప్రదర్శన కంటే ముందు IFTU పాలేరు ఏరియా కమిటీ కార్యదర్శి పగిడికత్తుల రామదాసుఅధ్యక్షతన సభను ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. సిపిఐ యం యల్ ప్రజాపంధా పార్టీ పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు, అఖిలభారత రైతుకూలి సంఘం ఏఐటీఏ నస్అఖిలభారత రైతుకూలి సంఘం ఏఐకె ఏం ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు బందెల వెంకయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్షులు కే సుబ్బారావ్, ప్రగతిశీల యువజన సంఘం పివైయల్ పాలేరు డివిజన్ అధ్యక్షుడు బచ్చల కూర శ్రీనివాసరావు, పిడిఎస్యు పాలేరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు టీ మురళి కృష్ణ, గోకినేపల్లి మస్తాన్, నాయకులు సాయి మల్సూర్, ప్రేమ్, అఖిలభారత రైతుకూలి తదితరులు ప్రసంగించారు