పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ధరలను వెంటనే తగ్గించాలి
Published: Saturday March 26, 2022
బెల్లంపల్లి మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ధరలను, వెంటనే తగ్గించి పేద ప్రజలపై భారం పడకుండా ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నాడు రాస్తా రోకో, ధర్నా నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ చిప్ప నరసయ్య, నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్, పట్టణ శాఖ కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మద్య, తరగతి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోగానే కార్పొరేట్లకు మేలు చేయడం కోసం చమురు,నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ, పేద మద్య తరగతి ప్రజలపై భారం మోపారని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు దిన దిన గండంగా జీవితాలు గడుపుతున్నారని, నిత్యవసర వస్తువుల, చమురు ధరలను తగ్గించే వరకు సి పి ఐ పార్టీ ఆధ్వర్యంలో సమర శీల పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి సి ఎల్ మందమర్రి ఏరియా కార్యదర్శి దాగం మల్లేష్, మండల కార్యదర్శి బోంతల లక్ష్మి నారాయణ, జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం, భవన నిర్మాణ కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎల్తూరి శంకర్, జిల్లా సమితి సభ్యులు అక్కపెల్లి బాపు, పట్టణ సహాయ కార్యదర్శి శనిగరపు రాజేందర్, అడేపు రాజమౌళి, రత్నం రాజం, ఐలయ్య, బోంకూరి రాంచందర్, సాగే గట్టయ్య, బండారి శంకర్, కె.నారాయణ, భరత్, శీలం చంద్రన్న, బి.రాజ్ కుమార్, కుమార్, కె.మల్లన్న, రాయమల్లు, బి.రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: