రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published: Saturday May 15, 2021
పటాన్ చేరు, మే 14, ప్రజాపాలన ప్రతినిధి : జాతీయ రహదారి నుండి పోచారం గ్రామం వరకు చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చిందని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. రహదారి అందుబాటులోకి వస్తే పోచారం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళతామని అన్నారు.
Share this on your social network: