రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Saturday May 15, 2021
పటాన్ చేరు, మే 14, ప్రజాపాలన ప్రతినిధి : జాతీయ రహదారి నుండి పోచారం గ్రామం వరకు చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చిందని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. రహదారి అందుబాటులోకి వస్తే పోచారం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు,  గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళతామని అన్నారు.