ఆశా మిత్ర లంకకొండ సన్మానించిన అంజన్న బాబు సత్యనారాయణ రెడ్డి మధిర రూరల్ నవంబర్ 6 ప్రజా పాలన ప్

Published: Monday November 07, 2022

గత 25 సంవత్సరాలనుండి ప్రపంచం ను పట్టి పీడిస్తున్న హెచ్ఐవిఎయిడ్స్ మహమ్మారి పై తన దైన శైలిలో అవగాహన పరుస్తూ హెచ్ఐవిఎయిడ్స్ బాధితులకుటుంబంలకు నేనున్నాను అంటూ వివిధ దాతలచే నిత్య అవసరం సరుకులు బియ్యం బట్టలు పంపిణి చేస్తూ వారి బాగోగు లు చూస్తూ రెండు తెలుగు రాష్టంలలో తీరిక సమయాలలో సెలవు దినాలలో సమాజహితం కోసం కృషి చేస్తున్న మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య జీవితం పలువురుకు ఆదర్శం అని ప్రముఖ విద్యావేత్తలు సత్తి రెడ్డి  అంజనబాబు  అన్నారు. శనివారం జరిగిన శ్రీ నిధి కళాశాల ఫ్రెషర్స్ డే సందర్బంగా రెడ్డి గార్డెన్ లో కొండయ్యను పుష్పగుచ్చాలు దుస్సాలువాతో ఘనంగా సత్కారం చేసినారు. ఈ కార్యక్రమంలో అందరప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర మాజీ నాయుకులు వి కొండల్ రావు తెలంగాణ ధూమ్ ధామ్ కరీమ్ నగర్ కళాకారిణి స్వర్ణ ప్రిన్సిపాల్ అనిల్ ప్రముఖులు పాల్గొని కొండయ్య సేవలు కొనియాడారు. నా సేవలు గుర్తించి సత్కారం చేసిన శ్రీ నిధి యాజమాన్యంకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపు తున్నట్లు కొండయ్య తెలిపి నారు. అనంతరం కొండయ్య విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసo గురించి చక్కని ఆశు గీతమ్ పాడి అలరించి ఎయిడ్స్ బారిన పడకుండా యువత ఏవిధంగా జాగ్రత్తలు తీసుకో వాలో వివరించారు.