సత్తుపల్లిలో పాగా వేసేందుకు వైఎస్ఆర్ టీపీ సిద్ధం.. *సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ గడి

Published: Saturday March 04, 2023
తల్లాడ, మార్చి 3 (ప్రజాపాలన న్యూస్):
వైయస్సార్  తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చూడటమే తమ థ్యేయమని ఆ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ గడిపల్లి కవిత అన్నారు. శుక్రవారం తల్లాడలో పార్టీ మండల అధ్యక్షులు వడ్డే రామారావు అధ్యక్షతన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాలను అందించారన్నారు. మరలా అటువంటి సువర్ణపాలన రావాలంటే వైఎస్ షర్మిలమ్మ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో దూసుకుపోతుంటే ప్రభుత్వం ఓర్వలేక అనేక కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రజలందరూ వాటిని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ టీపీకి మంచి ఆదరణ ఉందని, ఈ ఎన్నికల్లో గెలిచి సత్తుపల్లిలో పాగా వేస్తామని వెల్లడించారు. సత్తుపల్లిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వారిని ఓడించడానికి ప్రజలు ఎప్పుడుఎప్పుడా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఇకనుండి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, మంచి రోజులు వస్తాయని ఎవరూ అధైర్య పడొద్దన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు వడ్డే రామారావు, బండి బాలశౌరి, బొగ్గుల కృష్ణారెడ్డి, కోసూరు రామారావు, బొంతు వేణు, తదితరులు ఉన్నారు.*