సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి యుండి అసదుల్లా షరీఫ్.
Published: Thursday February 02, 2023
లక్షేట్టిపేట, ఫిబ్రవరి 01, ప్రజాపాలన:
పట్టణం లోని స్థానిక సబ్ జైల్ ను జూనియర్ సివిల్ జడ్జి యుండి అసదుల్లా షరీఫ్ బుదవారం సాయంత్రం ఆకస్మికంగా తనికీ చేశారు. సబ్ జైల్ లోని పరిసరాలను పరిశీలించి ఖైదీలకు అందుతున్న వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగి జీవితం లో మంచి వైపు అడుగులు వేయాలన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జీవితాలను వృధా చేసుకోవద్దని హితవు పలికారు. ఈ తనికీలో న్యాయమూర్తి వెంట బార్ అసోసియేషన్ జెనరల్ సెక్రెటరీ ఎస్. ప్రదీప్ కుమార్,న్యాయవాది తాజోద్దీన్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: