మేళ్ల చెర్వు రామతులసమ్మ పేరుతో కడుపేదలకు నిత్య అవసర సరుకులు పంపిణి మధిర రూరల్ జూన్17 ప్రజా పా

Published: Saturday June 18, 2022
మధిర పట్టణంలో స్థానిక గర్ల్స్ హైస్కూల్ వెనుక ఉన్న అన్నపూర్ణ రెసిడెన్సీ లో నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారి శ్రీ మేళ్లచెర్వు వెంకటేశ్వరావు బ్రదర్స్ యొక్క తల్లి  ఐన లేటు మేళ్ల చెర్వు రామతులసమ్మ గారి నాల్గవ వర్ధంతి సందర్బంగా ప్రముఖ సామాజిక సేవకులు లంకా సేవా ఫౌండేషన్ లంకా కొండ య్య ఏర్పాటు చేసిన నిరుపేద మహిళలు దీర్ఘ కాలిక అనారోగ్య బాధితులకు ఒక్కో క్కరికి ఒక నెలకు సరిపడా  నిత్య అవసర సరుకులు, బియ్యం వారి కూతురు తమ్మన వెంకట రత్న కుమారి అల్లుడు కృష్ణమూర్తి మరియు కొడుకులు కోడళ్ళు మేళ్ల చెర్వు వెంకటేశ్వరావు రాధ, శోభన చల ప్రసాద్ లక్ష్మి జ్యోతి రామ కృష్ణ పద్మావతి చేతుల మీదగా నూతన్ వస్త్రాలు మామిడి పండ్లు స్వీట్లు పంపిణి చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తల్లి తండ్రులు పేరుతో పేద వారికీ దాన ధర్మంలు చేయటం వారి ఆత్మ సంతోషముగా ఉంటుంది అని ఇలా ప్రతి ఒక్కరు లేని వారికీ సహాయం చేయాలి అని వివరించారు. ఇలా ఈ రోజు 11 మంది పేదలకు మండలం లో వివిధ గ్రామాల్లో ఉన్న వారికీ కొండయ్య  ద్వారా పంపిణి చేసారు.
  ఈ కార్యక్రమంలో రామ తులిసమ్మ 

మరి మనువళ్లు మనవరాళ్లు బంధువులు  మరియు ఆదర్శ ఫౌండేషన్ డైరెక్టర్ పగిడిపల్లి మోషే లంకా సేవ ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు.