పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలి.. సిడిపిఓ కృష్ణకుమారి

Published: Friday August 05, 2022

 

తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సీడీపీఓ కృష్ణకుమారి మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రేయోస్కారమన్నారు. తల్లిపాలలో పోషకాలు అధికంగా ఉంటాయన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, సూపర్వైజర్ సత్యవతి, ఏఎన్ఎం మరియమ్మ, వార్డు మెంబర్ గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, పద్మ, అంగన్వాడీ టీచర్లు వెంకటరత్నం, అన్నపూర్ణ, ప్రమీల, వెంకటరమణ,, టీచర్ పాపయ్య, ఆశా కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.