పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలి.. సిడిపిఓ కృష్ణకుమారి
Published: Friday August 05, 2022
తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సీడీపీఓ కృష్ణకుమారి మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రేయోస్కారమన్నారు. తల్లిపాలలో పోషకాలు అధికంగా ఉంటాయన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, సూపర్వైజర్ సత్యవతి, ఏఎన్ఎం మరియమ్మ, వార్డు మెంబర్ గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, పద్మ, అంగన్వాడీ టీచర్లు వెంకటరత్నం, అన్నపూర్ణ, ప్రమీల, వెంకటరమణ,, టీచర్ పాపయ్య, ఆశా కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: