ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు* *కౌన్సిలర్ కవాడి శ్రీలత

Published: Wednesday November 23, 2022

ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 22ప్రజాపాలన ప్రతినిధికరాడి శ్రీలత అనిల్ కుమార్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ వారి ఆధ్వర్యంలో ఉమార్ ఖాన్  గూడ మరియు అనేక కాలనీలలో నెలకొన్నటువంటి కరెంటు సమస్యలపై స్థానికంగా నెలకొన్న అనేక విషయాలపైన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి  వినతి పత్రం ఇవ్వడంతో సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీలత అనిల్ కుమార్ కౌన్సిలర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా స్థానికన్నుగా నెలకొన్న అటువంటి అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు అలాగే కాలనీవాసులతో కలిసి పెద్ద ఎత్తున  ఆందోళను నిర్వహిస్తామని అధికారులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు శ్రీశైలం, మాజీ అధ్యక్షులు బండారు దానయ్య, పండుగల రాము, నల్ల బాల్ రెడ్డి, తూల శంకరయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది.