గౌలిదొడ్డిలో ప్రజా సమస్యలపై బస్తి బాటస గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Published: Tuesday May 18, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సోమవారం గౌలిదొడ్డిలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా బస్తీలో డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు వరకు సుమారుగా రూ. 1.40 ఒక కోటి నలభై లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి. ఈ బస్తీబాట కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ బీజేపీ నాయకులు కిషన్ సింగ్, మునిసిపల్ అధికారులు, బస్తి వాసులు పాల్గొన్నారు.
Share this on your social network: