రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో ఆపన్న హస్తం

Published: Wednesday June 09, 2021
యువజన నాయకులు చాపల శ్రీనివాస్ ముదిరాజ్, జొన్నల రవిశంకర్
వికారాబాద్, జూన్ 08, ప్రజాపాలన బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెవాసులకు వ్యాక్సినేషన్ అవగాహన, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ యువజన నాయకులు చాపల శ్రీనివాస్ ముదిరాజ్, జొన్నల రవిశంకర్ లు సంయుక్తంగా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు వికారాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కేర్ కార్యక్రమంలో భాగంగా రోగులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ప్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి హాజరై, కరోనా నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఎల్లప్పుడూ ముందుండాలని, గ్రామాలలో కరోనా వ్యాక్సినేషన్ పై అవగాహనా కల్పించాలని సూచించారు. యువ నాయకులు మాట్లాడుతూ సేవ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ముందు ఉంటుందని, కరోనా వ్యాధి గ్రస్తులు, పేద ప్రజలకు భోజన సదుపాయం, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ లాంటి వాటికి  7013406478, 9849114825 కాల్ చేయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు రజినీకాంత్, రహీంమియా, వినయ్ యాదవ్, ఆగమయ్య, నవీన్ కుమార్, శేఖర్ గుప్త, రవి ముదిరాజ్, సాయికుమార్,  సద్దాం, విశాల్, మహేష్ బాండ్ తదితరులు పాల్గొన్నారు.