జాతీయ జెండాను ఎగరవేసిన రామ్ నాయక్..

Published: Friday January 27, 2023
 వైరా, జనవరి 26 (ప్రజాపాలన న్యూస్): 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వైరాలోని వైయస్సార్ తెలంగాణ టిపి కార్యాలయంలో, కొణిజర్ల మండలంలోని మేకాలకుంట గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఆ పార్టీ వైరా కోఆర్డినేటర్ ధర్మసోత్ రామ్ నాయక్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగమని, ఈ రాజ్యాంగం అమలు జరిగిన రోజును వేడుకలు జరుపుకుంటారన్నారు. అనంతరం ఇతర పార్టీల నుండి వైఎస్ఆర్ టిపిలో చేరిన వారికి ఆయన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.