మిలీనియం పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

Published: Friday December 23, 2022
అబ్బుర పరిచిన మాథ్స్ ఎక్స్పో* మధిర రూరల్ డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మిలీనియం టాలెంట్ స్కూల్ నందు గురువారం నాడు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలలో మ్యాథ్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయులని,చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ గణిత ఉపాధ్యాయులు బూసా కోటేశ్వరరావు గణిత సబ్జెక్టు నందు విద్యార్థులకు ఆసక్తికర విషయాలు తెలుపుతూ అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న  గణిత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారుఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసరావు,సుశీల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు,ఏఓ హరినాద్,సీనియర్ గణిత ఉపాధ్యాయులు టి.శ్రీనివాసరావు,జ్యోతి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.