టిఆర్ఎస్ తోనే యువత భవిషత్తు
Published: Friday August 13, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ తోనే యువతకు భవిషత్తు ఉంది అని అందుకు ఉదాహరణ. హుజురాబాద్ లో విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్యే అభ్యర్థి గా నిలబెట్టడమే అని టిఆర్ఎస్ యువ నాయకులు వనపర్తి బద్రీనాధ్ జానిపాష అన్నారు మంచాల మండల కేంద్రంలో దండేటికార్ ఉప సర్పంచి గార్డెన్ లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం తో యువతకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, పథకలతో అదే కాకుండా విద్యార్థి యువ నాయకులను పార్టీ లో పెద్ద పీట వేయడం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థి యువత నాయకులకు టిఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు విద్యార్థి యువత పార్టీ కి అండగా నిలపడతానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకులు మల్లప్ప, మహేందర్ యాదవ్, జలెందర్ రెడ్డి, బొట్టు ప్రవీణ్, ఆవుల ప్రశాంత్ యాదవ్, కొత్తపల్లి సాయి గౌడ్, రంజిత్, సీత మల్లేష్ యాదవ్, జల్దిరెడ్డి అశోక్ మహరాజ్, భరత్, నిఖిల్ గౌడ్, గజ్జి శివ యాదవ్. తదితరులు ఉన్నారు,
Share this on your social network: