వైఎస్ఆర్ టిపికి భారత ఎన్నికల సంఘం గుర్తింపు

Published: Friday February 25, 2022
వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి బాల్ రాజు
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన :  వైఎస్ఆర్ టిపీకి భారత ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందని వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షుడు తమ్మలి బాల్ రాజు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సూర్యప్రకాష్ టౌన్ షిప్ సమీపంలో వైఎస్ఆర్ టిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ టిపిని బలోపేతం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త శక్తివంచనలేకుండా పార్టీ వృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ పి.సుధారాణి, మీడియా ఇంచార్జీలు రమేష్, వసంత్ కుమార్, వైఎస్ఆర్ టిపి నాయకులు రత్నం, కె.రాములు, ఉప్పరి ప్రసాద్, రవి, వేణు, వీరేశం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.